14-03-23
భగవదనుభూతికి హృదయాన్ని తయారు చేయడం
ఇదే భగవంతుడు అని, నేను చూశానని మీరు అనుకుంటే, అది ఒక పెద్ద సమస్య అవుతుంది. బహుశా ఆయన దేవుడే కావచ్చు, కానీ హృదయంలో అనుభూతి చెందేవరకు… ఆయనను భగవంతుడు అని పిలవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే గుర్తించినప్పుడు, గుర్తింపు నుండి ఒక రకమైన శాంతిని అనుభవించడం ప్రారంభిస్తాం. మీరు శాంతిని అనుభవించడం ప్రారంభించినప్పుడు, ప్రయత్నం అనేదే ఉండదు, తపస్సు అనేదే జరగదు. అయితే దేవుడు ఎవరో తెలుసు. ఇది నిజం కూడా కావచ్చు, కానీ మీరు అనుభూతి చెందకుండానే వారిని అంగీకరించారు. చాలామంది ‘గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరా’ అంటారు. గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణువు, గురువు అంటే మహేశ్వరుడు అని ఇలా పోలిక తెస్తాం కదా! మనం ఎప్పుడు పోల్చగలం? ఆ రెండూ మనకు తెలిసినప్పుడు మాత్రమే. మీకు మహేష్ తెలియదు, విష్ణువు తెలియదు, బ్రహ్మ తెలియదు కానీ గురువు ఇలా ఉంటాడు అంటారు. అప్పుడు గురువు అంటే కూడా తెలియనట్లే. ఎవరూ తెలియకుండానే, మనం వారితో పోల్చేశాం. ఎందుకు? నాకు సంస్కృత శ్లోకం తెలుసు… నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు… అలాగ ఇది సమస్యగా మారుతుంది. ఎందుకు? నాకు సంస్కృత శ్లోకం తెలుసు… నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు… అలాగ ఇది సమస్యగా మారుతుంది. మన జ్ఞానం, జ్ఞాన సముపార్జన, అది మన వ్యక్తిగత అనుభవంపై ఆధారపడి ఉండాలి. అప్పుడు నేను దేవుడిని అనుభవించాను కాబట్టి నేను అంగీకరించినదాన్ని నమ్ముతున్నానని మనం నమ్మకంతో చెప్పగలం. సహజమార్గం అనేది మనకు అనుభూతిని క్రమంగా పెంచుతూ ఉండే మార్గం. మన హృదయ స్వచ్ఛత పెరిగే కొద్దీ, కొత్త కొత్త అద్భుత అనుభవాలకు సిద్ధమవుతాం. మురికి నీళ్లు – నూనె కలపండి. అలాగే స్వచ్ఛమైన నీరు, నూనె కూడా కలపండి. రెండూ స్వచ్ఛమైనవే. అయినా కూడా అవి కలవవు. రెండూ తమ తమ పరిధుల్లో స్వచ్ఛమైనవే. నీరు స్వచ్ఛమైనది, నూనె కూడా స్వచ్ఛమైనది, కానీ మిశ్రమం కాలేదు. రెండింటి స్వభావం వేరు. కబీర్ ఏమంటారంటే, ఒక వర్షపు చుక్క సముద్రంలో పడినప్పుడు అది సముద్రంగా మారుతుంది. కానీ నూనె పడితే, నూనె వర్షం పడితే, వేల సంవత్సరాల పాటు అది సముద్రపు నీటిపై తెట్టులా తేలియాడుతూనే ఉంటుంది. ఎన్నటికీ కలవదు. మరి ఆ నీటిచుక్క సముద్రంలో పడినప్పుడు, నేను సముద్రం అయ్యానని చుక్క ఎలా చెబుతుంది? అది ముగిసిపోయింది. చెప్పడానికి ఎవరూ లేరు… మరి భగవంతుని అనుభవం ఇలా ఉందని ఎవరు చెప్పగలరు? వారు చెప్పేవన్నీ అబద్ధాలే అవుతాయి. వారు తమ అనుగ్రహంతో మనలను అంతిమ తరగతిలో చేర్చినప్పుడు, అడగడానికి ఏమీ మిగలదు. మన నాలుక మౌనంగా మిగులుతుంది. అందుకే సనాతన ధర్మం, ఉపనిషత్తులలో ఏం చెప్పబడింది? అంతిమ స్థితిని ఏమన్నారు? నేతి, నేతి, నేతి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ లోకంలో దేవునితో పోల్చదగినది ఒక్కటి కూడా లేదు. అనుభవించిన ప్రతీదీ మూగగా మారుతుంది. అతను మాట్లాడతాడు కాని ఏం మాట్లాడతాడు? అపరిమితమైన ఆకాశాన్ని తన ఆవరణలోకి తీసుకువచ్చి, మీరు దాన్ని ఎలా వర్ణిస్తారు, అని అడగండి. ఆత్మానుగత ప్రపంచం అనంతం. ఆ అనంత ప్రపంచాన్ని మన మానసిక ప్రపంచంలోకి తేగలరా? అది ఎలాంటిదంటే ఆకాశాన్ని మన వాకిట్లోకి, పెరట్లోకి తెచ్చి ఇప్పుడు దీన్ని వివరించండి అన్నట్లుంటుంది. ఇది ఎలా కుదురుతుంది? మనో ప్రపంచం కూడా ఎంత పెద్దదంటే, దాన్ని ఆలోచనల్లోకి తీసుకురావడం ఎంత కష్టం? మీకు అనిపించినదాన్ని మీ ఆలోచనల్లోకి తీసుకురావడం చాలా కష్టం. అదేవిధంగా, చిన్న విషయం, మీరు గోధుమ రొట్టె తిని లేదా ఒక స్వీట్ తిని… ఎవరైనా యూరోపియన్ వచ్చి ఇది నీకెలా ఉంది అని అడిగితే, అప్పుడు ఇది చాలా మంచి స్వీట్ అంటావు, ఇంకా ఏం అంటావు? తిని తెలుసుకో సోదరా అని మాత్రం చెబుతావు. ఎందుకంటే కనీసం ఇలాంటి వాటి గురించి కూడా మనం చెప్పలేం. మన మనసు లోని భావాలను, అనుభూతులను మన ఆలోచనల్లోకి తీసుకురావడం చాలా కష్టం. ఇంక దాన్ని మాటల్లో తీసుకురావడం మరింత కష్టం. ఇలాంటి వేదికపై ఎవరైనా భగవంతుడు ఇలా ఉన్నాడు, అలా ఉంటాడు, అలా లేడు అని చెబితే, ప్రార్థిస్తూ గౌరవంగా అక్కడి నుంచి పారిపోండి. ‘వారికి వివరించింది, దయచేసి నాకు కూడా వివరించండి’ అని నేరుగా భగవంతుడినే ప్రార్థించండి. కేవలం హృదయం స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈశ్వరుడు స్వయంగా మీ హృదయంలోకి వస్తాడు. మీరు వారిని పిలవాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా వస్తారు. మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. తల్లి కోసం ఏడుస్తున్న పిల్లాడిలా ఉండండి. ఆయన కోసం అలాంటి ఆర్తి ఉండాలి. దానికోసం పడే తపనకు తెలివి, ధైర్యం అవసరం లేదు. ఏమీ అవసరం లేదు, కేవలం తపన, ప్రేమ చాలు. ప్రేమ ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే దొరుకుతుంది. మనకు కావలసిందల్లా తపన, వారి కొరకు చనిపోవడానికైనా సిద్ధపడే ప్రేమ. అంటే మనం అపరిమితమైన దాన్ని పొందాలనుకుంటే, మన ప్రయత్నాలు కూడా అపరిమితంగానే ఉండాలి. పరిమిత శ్రమతో ఐదు నిమిషాలు ధ్యానం, ఐదు నిమిషాలు నిర్మలీకరణ కూడా చేయరు కాని… ప్రజలు కేంద్ర మండలానికి చేరుకుని ఈశ్వరునిలో లయం కావాలని మాత్రం కోరుకుంటారు. అది ఎలా సాధ్యం? మనం అపరిమితమైన వాటితో విలీనం కావాలంటే, లయం అవడానికి, లయావస్థ సాధించడానికి… మన ప్రయత్నాలు కూడా అపరిమితంగా ఉండాలి.
14-03-23
భగవదనుభూతికి హృదయాన్ని తయారు చేయడం
ఇదే భగవంతుడు అని, నేను చూశానని మీరు అనుకుంటే, అది ఒక పెద్ద సమస్య అవుతుంది. బహుశా ఆయన దేవుడే కావచ్చు, కానీ హృదయంలో అనుభూతి చెందేవరకు… ఆయనను భగవంతుడు అని పిలవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే గుర్తించినప్పుడు, గుర్తింపు నుండి ఒక రకమైన శాంతిని అనుభవించడం ప్రారంభిస్తాం. మీరు శాంతిని అనుభవించడం ప్రారంభించినప్పుడు, ప్రయత్నం అనేదే ఉండదు, తపస్సు అనేదే జరగదు. అయితే దేవుడు ఎవరో తెలుసు. ఇది నిజం కూడా కావచ్చు, కానీ మీరు అనుభూతి చెందకుండానే వారిని అంగీకరించారు. చాలామంది ‘గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరా’ అంటారు. గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణువు, గురువు అంటే మహేశ్వరుడు అని ఇలా పోలిక తెస్తాం కదా! మనం ఎప్పుడు పోల్చగలం? ఆ రెండూ మనకు తెలిసినప్పుడు మాత్రమే. మీకు మహేష్ తెలియదు, విష్ణువు తెలియదు, బ్రహ్మ తెలియదు కానీ గురువు ఇలా ఉంటాడు అంటారు. అప్పుడు గురువు అంటే కూడా తెలియనట్లే. ఎవరూ తెలియకుండానే, మనం వారితో పోల్చేశాం. ఎందుకు? నాకు సంస్కృత శ్లోకం తెలుసు… నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు… అలాగ ఇది సమస్యగా మారుతుంది. ఎందుకు? నాకు సంస్కృత శ్లోకం తెలుసు… నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు… అలాగ ఇది సమస్యగా మారుతుంది. మన జ్ఞానం, జ్ఞాన సముపార్జన, అది మన వ్యక్తిగత అనుభవంపై ఆధారపడి ఉండాలి. అప్పుడు నేను దేవుడిని అనుభవించాను కాబట్టి నేను అంగీకరించినదాన్ని నమ్ముతున్నానని మనం నమ్మకంతో చెప్పగలం. సహజమార్గం అనేది మనకు అనుభూతిని క్రమంగా పెంచుతూ ఉండే మార్గం. మన హృదయ స్వచ్ఛత పెరిగే కొద్దీ, కొత్త కొత్త అద్భుత అనుభవాలకు సిద్ధమవుతాం. మురికి నీళ్లు – నూనె కలపండి. అలాగే స్వచ్ఛమైన నీరు, నూనె కూడా కలపండి. రెండూ స్వచ్ఛమైనవే. అయినా కూడా అవి కలవవు. రెండూ తమ తమ పరిధుల్లో స్వచ్ఛమైనవే. నీరు స్వచ్ఛమైనది, నూనె కూడా స్వచ్ఛమైనది, కానీ మిశ్రమం కాలేదు. రెండింటి స్వభావం వేరు. కబీర్ ఏమంటారంటే, ఒక వర్షపు చుక్క సముద్రంలో పడినప్పుడు అది సముద్రంగా మారుతుంది. కానీ నూనె పడితే, నూనె వర్షం పడితే, వేల సంవత్సరాల పాటు అది సముద్రపు నీటిపై తెట్టులా తేలియాడుతూనే ఉంటుంది. ఎన్నటికీ కలవదు. మరి ఆ నీటిచుక్క సముద్రంలో పడినప్పుడు, నేను సముద్రం అయ్యానని చుక్క ఎలా చెబుతుంది? అది ముగిసిపోయింది. చెప్పడానికి ఎవరూ లేరు… మరి భగవంతుని అనుభవం ఇలా ఉందని ఎవరు చెప్పగలరు? వారు చెప్పేవన్నీ అబద్ధాలే అవుతాయి. వారు తమ అనుగ్రహంతో మనలను అంతిమ తరగతిలో చేర్చినప్పుడు, అడగడానికి ఏమీ మిగలదు. మన నాలుక మౌనంగా మిగులుతుంది. అందుకే సనాతన ధర్మం, ఉపనిషత్తులలో ఏం చెప్పబడింది? అంతిమ స్థితిని ఏమన్నారు? నేతి, నేతి, నేతి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ లోకంలో దేవునితో పోల్చదగినది ఒక్కటి కూడా లేదు. అనుభవించిన ప్రతీదీ మూగగా మారుతుంది. అతను మాట్లాడతాడు కాని ఏం మాట్లాడతాడు? అపరిమితమైన ఆకాశాన్ని తన ఆవరణలోకి తీసుకువచ్చి, మీరు దాన్ని ఎలా వర్ణిస్తారు, అని అడగండి. ఆత్మానుగత ప్రపంచం అనంతం. ఆ అనంత ప్రపంచాన్ని మన మానసిక ప్రపంచంలోకి తేగలరా? అది ఎలాంటిదంటే ఆకాశాన్ని మన వాకిట్లోకి, పెరట్లోకి తెచ్చి ఇప్పుడు దీన్ని వివరించండి అన్నట్లుంటుంది. ఇది ఎలా కుదురుతుంది? మనో ప్రపంచం కూడా ఎంత పెద్దదంటే, దాన్ని ఆలోచనల్లోకి తీసుకురావడం ఎంత కష్టం? మీకు అనిపించినదాన్ని మీ ఆలోచనల్లోకి తీసుకురావడం చాలా కష్టం. అదేవిధంగా, చిన్న విషయం, మీరు గోధుమ రొట్టె తిని లేదా ఒక స్వీట్ తిని… ఎవరైనా యూరోపియన్ వచ్చి ఇది నీకెలా ఉంది అని అడిగితే, అప్పుడు ఇది చాలా మంచి స్వీట్ అంటావు, ఇంకా ఏం అంటావు? తిని తెలుసుకో సోదరా అని మాత్రం చెబుతావు. ఎందుకంటే కనీసం ఇలాంటి వాటి గురించి కూడా మనం చెప్పలేం. మన మనసు లోని భావాలను, అనుభూతులను మన ఆలోచనల్లోకి తీసుకురావడం చాలా కష్టం. ఇంక దాన్ని మాటల్లో తీసుకురావడం మరింత కష్టం. ఇలాంటి వేదికపై ఎవరైనా భగవంతుడు ఇలా ఉన్నాడు, అలా ఉంటాడు, అలా లేడు అని చెబితే, ప్రార్థిస్తూ గౌరవంగా అక్కడి నుంచి పారిపోండి. ‘వారికి వివరించింది, దయచేసి నాకు కూడా వివరించండి’ అని నేరుగా భగవంతుడినే ప్రార్థించండి. కేవలం హృదయం స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈశ్వరుడు స్వయంగా మీ హృదయంలోకి వస్తాడు. మీరు వారిని పిలవాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా వస్తారు. మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. తల్లి కోసం ఏడుస్తున్న పిల్లాడిలా ఉండండి. ఆయన కోసం అలాంటి ఆర్తి ఉండాలి. దానికోసం పడే తపనకు తెలివి, ధైర్యం అవసరం లేదు. ఏమీ అవసరం లేదు, కేవలం తపన, ప్రేమ చాలు. ప్రేమ ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే దొరుకుతుంది. మనకు కావలసిందల్లా తపన, వారి కొరకు చనిపోవడానికైనా సిద్ధపడే ప్రేమ. అంటే మనం అపరిమితమైన దాన్ని పొందాలనుకుంటే, మన ప్రయత్నాలు కూడా అపరిమితంగానే ఉండాలి. పరిమిత శ్రమతో ఐదు నిమిషాలు ధ్యానం, ఐదు నిమిషాలు నిర్మలీకరణ కూడా చేయరు కాని… ప్రజలు కేంద్ర మండలానికి చేరుకుని ఈశ్వరునిలో లయం కావాలని మాత్రం కోరుకుంటారు. అది ఎలా సాధ్యం? మనం అపరిమితమైన వాటితో విలీనం కావాలంటే, లయం అవడానికి, లయావస్థ సాధించడానికి… మన ప్రయత్నాలు కూడా అపరిమితంగా ఉండాలి.