08-04-23
అంతరంగంలో శూన్యత సృష్టించుకోండి
మనం చాలాసార్లు వర్షం ఎలా పడుతుందని ఆలోచిస్తూంటాం. మన దేశంలో వేసవి కాలం తరువాత వానలు పడతాయి. ఎండ వలన ఏం జరుగుతుంది? వేడి గాలి పైకి వెళ్తుంది. క్రింద శూన్యత ఏర్పడుతుంది. మేఘాలు అక్కడికి ఆకర్షించబడతాయి. ఉష్ణోగ్రత తగ్గడం వలన శీతలీకరణ జరిగి వర్షం కురుస్తుంది. ఇది చాలా సరళంగా, సహజంగా జరిగే ప్రక్రియ. నేను ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను? మనలో చాలామందిమి చాలాసార్లు భగవంతుని ఆశీస్సుల కోసం యాచిస్తుంటాం. ప్రభూ! మాపై దయ చూపించండి. మీరు చాలా దయామయులు! భగవంతుని ఇలా స్తుతిస్తూ ఉంటాం. కానీ ఆయనపై ఎటువంటి ప్రభావం ఉండదు. మన విజ్ఞాపనల ప్రభావం ఆయనపై పడాలంటే మనవైపు నుండి హృదయంలో ఎంత శూన్యత ఉంది? వేసవి కాలం ఈ శూన్యత వాతావరణంలో సహజంగానే ఏర్పడుతుంది. మనలో ఈ శూన్యత ఎలా ఏర్పడుతుంది? లోపల చాలా నిండిపోయి ఉంది. లోపల నిండిఉన్న దాన్ని బయటకి పంపి శుభ్రం చేస్తేనే కదా, లోపల కాస్త చోటు ఏర్పడేది! అప్పుడే కదా! భగవంతుడి కృప, కానుక లేదా మరొకటి అనండి, అది మనపై ప్రవహించేది. దాన్ని తోసి, బలవంతం చేసి ఎవ్వరికీ ఇవ్వలేం. తపస్సు చేసి మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి. తపస్సు అంటే వేడి కదా! మన సంస్కృత భాషలో ఎంతో లోతైన అర్థం ఉన్న మంచి పదాలు ఉన్నాయి. తపస్సు – తాపంతో ఎందుకో జోడించారు. అక్కడ కేవలం శీతలంగా మాత్రమే ఉంటుంది. తపస్సుతో కాకుండా మరే విధంగానూ భగవంతుని కృప, అనుగ్రహం పొందలేమని… చాలా తేలికైన పదాలతో మనకు అర్థం అయ్యే విధంగా చెప్పారు. తమను తాము సన్నద్ధం చేసుకోవాలి అంటూ ఉంటారు కదా! స్వర్గానికి వెళ్లడానికి సిద్ధమౌతున్నారు అని. ఎందుకు? స్వర్గం అనే ప్రదేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ భగవంతుడు ఉంటాడో అదే స్వర్గం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ. మన హృదయం పవిత్రంగా ఉంటే, ఖచ్చితంగా భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడు. కాబట్టి స్వర్గం మన హృదయంలోకే దిగి వస్తుంది. స్వర్గానికి వెళ్ళే అవసరం ఉండదు. ఇవన్నీ మన గురువర్యుల సందేశాలు. వీటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంసిధ్ధత! మనం కేవలం సిద్ధంగా ఉండాలి. నాలో ఆ శూన్యత కలగాలి అని పట్టుదలతో ప్రయత్నం చెయ్యాలి. ఎవరినీ బలవంతంగా నాకు ఇది కావాలి అని అనలేం. అందుకే భగవద్గీతలో చెప్పినట్లు – కర్మణ్యేవాధికారస్తే… బ్రహ్మవిద్య కోసం ప్రయత్నం చెయ్యడం మన కర్తవ్యం. దాని ఫలితం మన బాధ్యత కాదు. మా ఫలేషు కదాచన… ఫలితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు. అది శరణాగతి భావన. శరణాగతి వల్లనే మన హృదయంలో ఆ శూన్యత ఏర్పడుతుంది. ఇలా మొదటి మూఢ నమ్మకం ఆశీర్వాదం గురించి. రెండవ మూఢ నమ్మకం – దర్శనం గురించి. సాధు సత్పురుషులను ఒకసారి దర్శనం చేసుకుంటే పని జరిగిపోతుందనే భావన. ఇది అంత తేలికైనది కాదు. బాబూజీ అనేవారు – నన్ను కాకులు, కోతులు, గాడిదలు అన్నీ చూస్తూ ఉంటాయి. మీరు కూడా దర్శిస్తూ ఉంటారు. వ్యత్యాసం ఏమిటి? పరివర్తన లేనప్పుడు గాడిద, గాడిద గానే ఉంటుంది. కోతి, కోతి గానే ఉంటుంది. మీరు కూడా ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మార్పు అనేది లోపల నుండి రావాలి. దర్శనం చేసుకున్న పిమ్మట వారి నుండి స్పూర్తిని పొంది, వారిలా మారలేకపోతే ఆ దర్శనం వలన ఉపయోగం లేదు. వర్షం పడుతుంది, కానీ మీరు విత్తనం నాటకపోతే ఏమీ జరగదు. ఏం నాటాలి? మన ఆలోచనలలో ఎటువంటి విత్తనం నాటాలంటే… ‘నేను ఇలా అవ్వాలి’ అనే సంకల్పం చేసుకోవాలి. ఇలా అవ్వాలి అనే సంకల్పం చేసుకోవడాన్నే హృదయంలో విత్తనం నాటడం అని అంటారు. ‘నేను మారాలి’. ఏమవ్వాలి? దేని నుండి విముక్తి పొందాలి? ఇది మీకు తెలిసినదే. రాత్రిపూట ప్రార్థన చేసుకొనేటప్పుడు… ‘నాలో ఈ లోపాలు ఉన్నాయి’ అని భగవంతుడికి విన్నవించుకోండి. అవి పొలంలో కలుపు మొక్కల వంటివి. కలుపుని తొలగించాలి. కలుపుని పంజాబీలో ఏమంటారు? కట్ పట్… మీకు అర్థం అయ్యింది కదా! వాటిని తొలగించాలి. మనలోని లోపాలను తొలగించాలి. తరువాత మంచి విత్తనాలు నాటాలి. మీరు కనుక ఇది చెయ్యకపోతే, అక్కడ ఒక అడవి తయారవుతుంది. అడవి తయారయ్యింది అంటే, ఇక మన చేతిలో ఏమీ ఉండదు. తరువాత మరింత ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ఒక ఏడాది పాటు కలుపు తీయకపోతే, మరుసటి సంవత్సరం మరింత ఎక్కువ పెరుగుతుంది. మనలో ఏర్పడే ఈ లోపాల పెరుగుదల, కాలుష్యం, ఆలోచనల కాలుష్యం, భావనల కాలుష్యం, వీటి వలన బాహ్యంగా కాలుష్యం ఏర్పడుతుంది. మనలో లోభం లేదా దురాశ పెరగడం వలన, చమురు శుద్ధి కర్మాగారమో, రసాయన కర్మాగారమో స్థాపిస్తాం. తద్వారా పారిశ్రామిక వ్యర్థాలు కూడా వస్తాయి. వ్యర్థాలని గాలిలోకి, నీటిలోకి, భూమిలోకి వదిలి పెడతాం. ఇవన్నీ లోభం వల్లనే. అందుకనే బాబూజీ మహరాజ్ అనేవారు… మన కోరికలే మన ఉన్నతికి ఆటంకాలు అని. చెప్పడానికి బాగానే ఉంటుంది. ఈ లోభాన్ని వదిలించుకోవడం ఎలా? సహజమార్గ పద్ధతి ప్రకారం, మనం దేన్నీ వదులుకోనవసరం లేదు. అన్నీ తమంతట తామే సహజంగా జరుగుతాయి. ఒకరితో జత కడితే… అంటారు కదా, ఒకరు జతగా ఉంటే అందరూ తోడు ఉన్నట్లే, అదే అందరితో జత కడితే ఎవ్వరూ తోడు లేనట్లే! ఒకరిని నమ్ముకుంటే, మిగతా పని అంతా వారే చూసుకుంటారు. మన పని ఏమిటి? కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడమే కదా? అంతకన్నా ఇంకేమన్నా చేస్తున్నామా? మనందరం కళ్ళు మూసుకుని కూర్చోగలం కదా! ప్రేమతో కళ్ళు మూసుకుంటే… మన జీవితాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు జరగవచ్చు. లేకపోతే ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్తాం. రావడం, పోవడం, రావడం, పోవడం అనే ఈ ప్రహసనం ఇలాగే కొనసాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దర్శనం గురించి ఇంకా చాలా చెప్పవచ్చు. జనులు భౌతిక దర్శనంతో సంతోష పడతారు. అలా ఆనంద పడవద్దు. కరచాలనం చేశా, నమస్కారం చేశా, తల మీద వారి చెయ్యి పెట్టించుకున్నా! ఎప్పటి వరకు లోపల నుండి మార్పు రాదో, అప్పటి వరకు ఏమీ జరగదు. హృదయ ద్వారాలు తెరవడం అనేది ఏదో శస్త్రచికిత్స బయట నుండి చెయ్యడంలా ఉండదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ భూమ్మీద నడిచారు. అయితే వారిని స్వయంగా చూసిన వారు సైతం ఎంతమంది వారిని గుర్తించారు? ఎవ్వరూ గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా వారు అవతార పురుషులు మాత్రమే, అంతకంటే ఇంకేమీ కాదు కదా? తరువాత ఏమిటి? మీ బుర్రలో ఏదన్నా ప్రణాళిక ఉందా? ఒకవేళ మీరు ఆ సమయంలో అక్కడ ఉన్నా, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారమని… గుర్తు పట్టినా, మన తదుపరి కార్యాచరణ ఏమిటి? ఆలోచించారా? అదే మూర్ఖత్వంతో వారిని అనుసరించి పూజలు చేస్తూ ఉంటారా? ఎక్కడి నుండి అనుసరిస్తారు? వెనక వెనకే తిరుగుతారా? హృదయంతో వారిని అనుసరించండి. కాబట్టి వారిని అనుసరించాలంటే మీ హృదయంతో అనుసరించండి. అలాగని వారు ఇప్పుడు లేరని కాదు. వారు అన్నిచోట్లా ఉన్నారు. మునుపటి కన్నా ఇప్పుడు ఇంకా తేలిక. హృదయంతో అనుసరించండి. నాలో ఇటువంటి మూర్ఖత్వం, లోపాలు ఉన్నాయని కొంచెం రోదించండి. వారి సహాయంతో వాటి నుండి విముక్తి పొందగలుగుతాం. మునుపటి కన్నా మంచి వ్యక్తులం అవ్వగలం. అనంతరం మనం దివ్యత్వంగా మారే అవకాశం కూడా ఉంది.
08-04-23
అంతరంగంలో శూన్యత సృష్టించుకోండి
మనం చాలాసార్లు వర్షం ఎలా పడుతుందని ఆలోచిస్తూంటాం. మన దేశంలో వేసవి కాలం తరువాత వానలు పడతాయి. ఎండ వలన ఏం జరుగుతుంది? వేడి గాలి పైకి వెళ్తుంది. క్రింద శూన్యత ఏర్పడుతుంది. మేఘాలు అక్కడికి ఆకర్షించబడతాయి. ఉష్ణోగ్రత తగ్గడం వలన శీతలీకరణ జరిగి వర్షం కురుస్తుంది. ఇది చాలా సరళంగా, సహజంగా జరిగే ప్రక్రియ. నేను ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను? మనలో చాలామందిమి చాలాసార్లు భగవంతుని ఆశీస్సుల కోసం యాచిస్తుంటాం. ప్రభూ! మాపై దయ చూపించండి. మీరు చాలా దయామయులు! భగవంతుని ఇలా స్తుతిస్తూ ఉంటాం. కానీ ఆయనపై ఎటువంటి ప్రభావం ఉండదు. మన విజ్ఞాపనల ప్రభావం ఆయనపై పడాలంటే మనవైపు నుండి హృదయంలో ఎంత శూన్యత ఉంది? వేసవి కాలం ఈ శూన్యత వాతావరణంలో సహజంగానే ఏర్పడుతుంది. మనలో ఈ శూన్యత ఎలా ఏర్పడుతుంది? లోపల చాలా నిండిపోయి ఉంది. లోపల నిండిఉన్న దాన్ని బయటకి పంపి శుభ్రం చేస్తేనే కదా, లోపల కాస్త చోటు ఏర్పడేది! అప్పుడే కదా! భగవంతుడి కృప, కానుక లేదా మరొకటి అనండి, అది మనపై ప్రవహించేది. దాన్ని తోసి, బలవంతం చేసి ఎవ్వరికీ ఇవ్వలేం. తపస్సు చేసి మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి. తపస్సు అంటే వేడి కదా! మన సంస్కృత భాషలో ఎంతో లోతైన అర్థం ఉన్న మంచి పదాలు ఉన్నాయి. తపస్సు – తాపంతో ఎందుకో జోడించారు. అక్కడ కేవలం శీతలంగా మాత్రమే ఉంటుంది. తపస్సుతో కాకుండా మరే విధంగానూ భగవంతుని కృప, అనుగ్రహం పొందలేమని… చాలా తేలికైన పదాలతో మనకు అర్థం అయ్యే విధంగా చెప్పారు. తమను తాము సన్నద్ధం చేసుకోవాలి అంటూ ఉంటారు కదా! స్వర్గానికి వెళ్లడానికి సిద్ధమౌతున్నారు అని. ఎందుకు? స్వర్గం అనే ప్రదేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ భగవంతుడు ఉంటాడో అదే స్వర్గం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ. మన హృదయం పవిత్రంగా ఉంటే, ఖచ్చితంగా భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడు. కాబట్టి స్వర్గం మన హృదయంలోకే దిగి వస్తుంది. స్వర్గానికి వెళ్ళే అవసరం ఉండదు. ఇవన్నీ మన గురువర్యుల సందేశాలు. వీటిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంసిధ్ధత! మనం కేవలం సిద్ధంగా ఉండాలి. నాలో ఆ శూన్యత కలగాలి అని పట్టుదలతో ప్రయత్నం చెయ్యాలి. ఎవరినీ బలవంతంగా నాకు ఇది కావాలి అని అనలేం. అందుకే భగవద్గీతలో చెప్పినట్లు – కర్మణ్యేవాధికారస్తే… బ్రహ్మవిద్య కోసం ప్రయత్నం చెయ్యడం మన కర్తవ్యం. దాని ఫలితం మన బాధ్యత కాదు. మా ఫలేషు కదాచన… ఫలితం మీద నీకు ఎటువంటి హక్కు లేదు. అది శరణాగతి భావన. శరణాగతి వల్లనే మన హృదయంలో ఆ శూన్యత ఏర్పడుతుంది. ఇలా మొదటి మూఢ నమ్మకం ఆశీర్వాదం గురించి. రెండవ మూఢ నమ్మకం – దర్శనం గురించి. సాధు సత్పురుషులను ఒకసారి దర్శనం చేసుకుంటే పని జరిగిపోతుందనే భావన. ఇది అంత తేలికైనది కాదు. బాబూజీ అనేవారు – నన్ను కాకులు, కోతులు, గాడిదలు అన్నీ చూస్తూ ఉంటాయి. మీరు కూడా దర్శిస్తూ ఉంటారు. వ్యత్యాసం ఏమిటి? పరివర్తన లేనప్పుడు గాడిద, గాడిద గానే ఉంటుంది. కోతి, కోతి గానే ఉంటుంది. మీరు కూడా ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మార్పు అనేది లోపల నుండి రావాలి. దర్శనం చేసుకున్న పిమ్మట వారి నుండి స్పూర్తిని పొంది, వారిలా మారలేకపోతే ఆ దర్శనం వలన ఉపయోగం లేదు. వర్షం పడుతుంది, కానీ మీరు విత్తనం నాటకపోతే ఏమీ జరగదు. ఏం నాటాలి? మన ఆలోచనలలో ఎటువంటి విత్తనం నాటాలంటే… ‘నేను ఇలా అవ్వాలి’ అనే సంకల్పం చేసుకోవాలి. ఇలా అవ్వాలి అనే సంకల్పం చేసుకోవడాన్నే హృదయంలో విత్తనం నాటడం అని అంటారు. ‘నేను మారాలి’. ఏమవ్వాలి? దేని నుండి విముక్తి పొందాలి? ఇది మీకు తెలిసినదే. రాత్రిపూట ప్రార్థన చేసుకొనేటప్పుడు… ‘నాలో ఈ లోపాలు ఉన్నాయి’ అని భగవంతుడికి విన్నవించుకోండి. అవి పొలంలో కలుపు మొక్కల వంటివి. కలుపుని తొలగించాలి. కలుపుని పంజాబీలో ఏమంటారు? కట్ పట్… మీకు అర్థం అయ్యింది కదా! వాటిని తొలగించాలి. మనలోని లోపాలను తొలగించాలి. తరువాత మంచి విత్తనాలు నాటాలి. మీరు కనుక ఇది చెయ్యకపోతే, అక్కడ ఒక అడవి తయారవుతుంది. అడవి తయారయ్యింది అంటే, ఇక మన చేతిలో ఏమీ ఉండదు. తరువాత మరింత ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ఒక ఏడాది పాటు కలుపు తీయకపోతే, మరుసటి సంవత్సరం మరింత ఎక్కువ పెరుగుతుంది. మనలో ఏర్పడే ఈ లోపాల పెరుగుదల, కాలుష్యం, ఆలోచనల కాలుష్యం, భావనల కాలుష్యం, వీటి వలన బాహ్యంగా కాలుష్యం ఏర్పడుతుంది. మనలో లోభం లేదా దురాశ పెరగడం వలన, చమురు శుద్ధి కర్మాగారమో, రసాయన కర్మాగారమో స్థాపిస్తాం. తద్వారా పారిశ్రామిక వ్యర్థాలు కూడా వస్తాయి. వ్యర్థాలని గాలిలోకి, నీటిలోకి, భూమిలోకి వదిలి పెడతాం. ఇవన్నీ లోభం వల్లనే. అందుకనే బాబూజీ మహరాజ్ అనేవారు… మన కోరికలే మన ఉన్నతికి ఆటంకాలు అని. చెప్పడానికి బాగానే ఉంటుంది. ఈ లోభాన్ని వదిలించుకోవడం ఎలా? సహజమార్గ పద్ధతి ప్రకారం, మనం దేన్నీ వదులుకోనవసరం లేదు. అన్నీ తమంతట తామే సహజంగా జరుగుతాయి. ఒకరితో జత కడితే… అంటారు కదా, ఒకరు జతగా ఉంటే అందరూ తోడు ఉన్నట్లే, అదే అందరితో జత కడితే ఎవ్వరూ తోడు లేనట్లే! ఒకరిని నమ్ముకుంటే, మిగతా పని అంతా వారే చూసుకుంటారు. మన పని ఏమిటి? కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడమే కదా? అంతకన్నా ఇంకేమన్నా చేస్తున్నామా? మనందరం కళ్ళు మూసుకుని కూర్చోగలం కదా! ప్రేమతో కళ్ళు మూసుకుంటే… మన జీవితాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు జరగవచ్చు. లేకపోతే ఎలా వచ్చామో అలాగే తిరిగి వెళ్తాం. రావడం, పోవడం, రావడం, పోవడం అనే ఈ ప్రహసనం ఇలాగే కొనసాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దర్శనం గురించి ఇంకా చాలా చెప్పవచ్చు. జనులు భౌతిక దర్శనంతో సంతోష పడతారు. అలా ఆనంద పడవద్దు. కరచాలనం చేశా, నమస్కారం చేశా, తల మీద వారి చెయ్యి పెట్టించుకున్నా! ఎప్పటి వరకు లోపల నుండి మార్పు రాదో, అప్పటి వరకు ఏమీ జరగదు. హృదయ ద్వారాలు తెరవడం అనేది ఏదో శస్త్రచికిత్స బయట నుండి చెయ్యడంలా ఉండదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ భూమ్మీద నడిచారు. అయితే వారిని స్వయంగా చూసిన వారు సైతం ఎంతమంది వారిని గుర్తించారు? ఎవ్వరూ గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా వారు అవతార పురుషులు మాత్రమే, అంతకంటే ఇంకేమీ కాదు కదా? తరువాత ఏమిటి? మీ బుర్రలో ఏదన్నా ప్రణాళిక ఉందా? ఒకవేళ మీరు ఆ సమయంలో అక్కడ ఉన్నా, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారమని… గుర్తు పట్టినా, మన తదుపరి కార్యాచరణ ఏమిటి? ఆలోచించారా? అదే మూర్ఖత్వంతో వారిని అనుసరించి పూజలు చేస్తూ ఉంటారా? ఎక్కడి నుండి అనుసరిస్తారు? వెనక వెనకే తిరుగుతారా? హృదయంతో వారిని అనుసరించండి. కాబట్టి వారిని అనుసరించాలంటే మీ హృదయంతో అనుసరించండి. అలాగని వారు ఇప్పుడు లేరని కాదు. వారు అన్నిచోట్లా ఉన్నారు. మునుపటి కన్నా ఇప్పుడు ఇంకా తేలిక. హృదయంతో అనుసరించండి. నాలో ఇటువంటి మూర్ఖత్వం, లోపాలు ఉన్నాయని కొంచెం రోదించండి. వారి సహాయంతో వాటి నుండి విముక్తి పొందగలుగుతాం. మునుపటి కన్నా మంచి వ్యక్తులం అవ్వగలం. అనంతరం మనం దివ్యత్వంగా మారే అవకాశం కూడా ఉంది.