19-06-23, Faith On God
భగవంతుని పై విశ్వాసం
అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ అశ్విన్ లడ్డా, మేనేజింగ్ డైరెక్టర్, ఓరియంట్ పేపర్ మిల్స్ గారికి… ఆశా ఫౌండేషన్ కి చెందిన ఆశిష్ గారికి మరియు ఓపియం యొక్క పరిపాలనా కార్యవర్గ సభ్యులకు… గ్రామగ్రామాల నుండి వచ్చిన సోదర, సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఇవాల్టి విషయం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏమిటి? మొదట మనం ఆధ్యాత్మికత అంటే ఏం అర్థం చేసుకున్నామో తెలియాలి. ధర్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? రెండింటి మధ్య తేడా ఏమిటి? ధర్మం, ఈశ్వరుడు ఉన్నాడనే అంటుంది. మనం ఈశ్వరుడు ఉన్నాడు అని విశ్వసిస్తాము కూడా! తల్లిదండ్రులను అడగండి, అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్య లను “మీరు భగవంతుడిని నమ్ముతున్నారా” అని అడగండి. వారు అలా ఎందుకు అడుగుతున్నావు? అని అంటారు. కానీ వారిని, ‘మీరు ఎందుకు నమ్ముతారు,’ అని అడిగితే… “మా అమ్మ అలా నేర్పించింది, మన ధర్మం అలా నేర్పిస్తుంది, మన శాస్త్రాలు ఇలా నేర్పిస్తాయి” అని సమాధానం చెబుతారు. అదే మనం ‘మీరేమి చెబుతారు?’ అని అడిగితే వారు నిశ్శబ్దంగా ఉంటారు. “నేనేమీ చెప్పను, ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం, నేను భగవంతుని మీద విశ్వాసం ఉంచుతాను” అని అంటారు. ఇది ధర్మం యొక్క విషయం. ఆధ్యాత్మికతలో ఏముంటుంది? ఆధ్యాత్మికతలో మొదట అనుభూతి కలుగుతుంది “అవును నేను ఈశ్వరీయ తత్వాన్ని అనుభూతి చెందాను… కాబట్టి నేను భగవంతుణ్ణి నమ్ముతాను” అని భావిస్తాము. రెండింటికి మధ్య ఇలా చాలా తేడా ఉంటుంది… కాబట్టి మనకు ధ్యాన పద్ధతిలో భగవంతుని యొక్క అనుభూతి కల్గుతుంది. రెండవ ప్రశ్న మీ ముందు ఉంచుతాను… భగవంతుని కోసం మనం ఎక్కడ వెతకాలి? ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడ వెతకాలి? శాస్త్రాలు ఈశ్వరుడు అన్నిచోట్ల ఉంటాడు, అని చెబుతాయి. మీకు ఉదాహరణగా నేను ఒక పరిస్థితిని వివరిస్తాను… తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు… బిడ్డ తల్లి నుండి వేరుపడగానే ఏడుస్తాడు. బిడ్డ ఏడవడం తల్లికి చాలా ఆనందం కలిగిస్తుంది. తర్వాత ఎప్పుడైనా బిడ్డ ఏడిస్తే తల్లి కూడా ఏడుస్తుంది… కానీ ఈ జన్మనిచ్చే సమయంలో మాత్రమే బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి మొహంలో నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే బిడ్డతో ఏదైతే రావలసి ఉందో అది వచ్చింది. దాన్ని మనం ఆత్మ, జీవశక్తి, జీవన దాత లేదా ఇంగ్లీషులో సోల్ అంటాం. శాస్త్రాలు చదివిన వారు ఆత్మ లేదా జీవాత్మ అంటారు. ఏ పేరైనా పెట్టండి, తేడా ఏమీ ఉండదు. మనకు జీవాన్నిచ్చేది మన లోపల ఉందా? లోపలే ఉంది కదా! బయట లేదు కదా! అది లేకుండా మనం ప్రార్థించలేము. ధ్యానం కూడా చేయలేము. అది లేకుండా మనం ద్వారక కూడా వెళ్లలేం. ఏదైతే మన లోపల ఉందో, దేని అనుభూతి లోపలే పొందాలో… దాని దర్శనం కోసం మనం బయటకు పరిగెడితే దర్శనం ఎలా జరుగుతుంది? మీరు కొంచెం ఆలోచించండి. ఇప్పుడు అనుభూతి చెందవలసినది బయట ఎప్పటికీ లభించదు. బయట అనుభూతి ఎలా అవుతుంది? ఉదాహరణకు నేను సెంటు రాసుకున్నా, అత్తరు పూసుకున్నా ముక్కు ద్వారా దాని సుగంధం వస్తుంది. ఏదైనా తిన్నప్పుడు అది కడుపులో పడుతుంది. శాంతి అనుభవం పొందాలంటే, అది హృదయం ద్వారానే అనుభూతి చెందబడుతుంది. శ్రీకృష్ణ భగవానునితో అర్జునుడు, “శ్రీకృష్ణా! మీరు నా స్నేహితులు. నాకు మీ విశ్వరూపాన్ని చూపించారు… దయచేసి మీ నిజరూపంలోకి రండి. ఈ రూపం నన్ను గాభరా పెడుతున్నది, భయపెడుతున్నది.. రాబోయే తరాల వారు మీ దర్శనం ఎలా చేసుకుంటారు?” అని అడిగాడు. ‘హృదయమే పశ్యసి’ అని శ్రీకృష్ణుడు అంటారు. “మీ హృదయంలో మీరు నన్ను అనుభూతి చెందండి”. “ద్వారకకు వెళ్లి లేదా కైలాసంలో అనుభూతి చెందండి అని చెప్పలేదు… ‘హృదయమే పశ్యసి’ అంటే ప్రతి హృదయంలో నేనున్నాను”, అన్నారు. అయినప్పటికీ మనం తప్పు చేస్తూనే ఉంటే, దానికి పరిష్కారం ఎలా లభిస్తుంది? తప్పు చేస్తూ ఉంటే మంచి పరిష్కారం లభించదు. అలాగని నేను ఈశ్వరుని అంగీకరించనని అర్థం కాదు. నేను మీకు, మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి, ఒక విధంగా సరైన మార్గాన్ని చూపించడానికే ప్రయత్నిస్తున్నాను. అందుకే మన వేదాలలో, ఉపనిషత్తులలో ఆయనను ‘అంతర్యామిన్’ అని చెప్పబడింది. అంటే లోపల ఉండేది, బయట లేదని అర్థం. ఆయన అనుభూతి లోపలే కలుగుతుంది. ఈరోజు మనం అనుభూతి చెందడానికి ప్రయత్నిద్దాం. మీలో ఎంతమంది హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో ఈ ఉదయం ధ్యానం చేశారు? ఓహ్! చాలామంది ఉన్నారు. ఇంకా ఎక్కువగా చెప్పే అవసరం లేదనిపిస్తుంది. మరి నేను ఎందుకు చెప్తున్నాను? నేరుగా మనం ధ్యానం చేద్దాం. సోదరి జర్శ్వీందర్ ఇక్కడ ఉన్నట్లయితే, దయచేసి మాతో రిలాక్సేషన్ చేయించమని మనవి చేస్తున్నాను. వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు ఒక కార్యక్రమం ఉంది… ఆశా ఫౌండేషన్, ఓరియంట్ పేపర్ మిల్స్ మరియు హార్ట్ఫుల్నెస్ ఏకమైతే ఫలితం ఏమై ఉంటుంది? ఆధ్యాత్మికంలో ఉన్నతి అయితే కలగాలి కదా! భౌతిక జీవితంలో కూడా ఉన్నతి కలుగుతుంది. భౌతిక జీవితంలో, విద్యలో, సామాజిక జీవితంలో, మన ఉద్వేగపరమైన జీవితంలో అన్నింటిలో అభివృద్ధి జరుగుతుంది. ఒక ఉదాహరణను చూద్దాం. కాగితం కోసం యూకలిప్టస్ పెంచుతాం… అలాగే ప్రతి గ్రామంలో బంజరు భూమి ఉన్న చోట ఒక ఎకరం, 10 ఎకరాల స్థలంలో… గ్రామస్తులు అందరితో కలిసి తెల్లచందనం, ఎర్రచందనం మొక్కలను నాటుదాం. మీరు ఏమీ చేయనవసరం లేదు. మేమే నాటుతాం. ప్రతి ఉదయం అక్కడికి వెళ్లి ఒక మగ్గు నీళ్లను పోయడం మీ పని. ఇంతకంటే ఏమీ చేసేది లేదు. పది సంవత్సరాల దాకా మీ గ్రామస్తులు అందరూ కలిసి వాటి సంరక్షణ చేయాలి. చాలామంది వాటిని దొంగతనంగా ఎత్తుకొని పోతారు. ఒక మొక్క ఖరీదు నల్ల బజారులో ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఐదు లక్షల రూపాయలు! మనం కావాలనుకుంటే వెయ్యి, పది వేలు మొక్కలను నాటితే ఎంత అవుతుందో లెక్క వేయండి. 500 కోట్లు అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఆ 500 కోట్ల రూపాయలను గ్రామస్తులందరికీ పంచండి. మీ నుండి మేం ఏమీ తీసుకోము. ఆశా వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారు కదా! వారు కూడా మీ నుండి ఏమి తీసుకోవాలనుకోరు. ఆలోచించండి. వీళ్లు ఇంత దూరం నుండి వస్తారు. వారికి ఏ స్వార్థమూ లేదు. మాకు ఏమీ అవసరం లేదని వారు మనకు గ్యారెంటీ వ్రాసిస్తారు. మీరు ఉదయం, సాయంత్రం కళ్ళు మూసుకుని ఈశ్వరుని ధ్యానించండి. అంతే!
19-06-23, Faith On God
భగవంతుని పై విశ్వాసం
అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ అశ్విన్ లడ్డా, మేనేజింగ్ డైరెక్టర్, ఓరియంట్ పేపర్ మిల్స్ గారికి… ఆశా ఫౌండేషన్ కి చెందిన ఆశిష్ గారికి మరియు ఓపియం యొక్క పరిపాలనా కార్యవర్గ సభ్యులకు… గ్రామగ్రామాల నుండి వచ్చిన సోదర, సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఇవాల్టి విషయం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏమిటి? మొదట మనం ఆధ్యాత్మికత అంటే ఏం అర్థం చేసుకున్నామో తెలియాలి. ధర్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? రెండింటి మధ్య తేడా ఏమిటి? ధర్మం, ఈశ్వరుడు ఉన్నాడనే అంటుంది. మనం ఈశ్వరుడు ఉన్నాడు అని విశ్వసిస్తాము కూడా! తల్లిదండ్రులను అడగండి, అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్య లను “మీరు భగవంతుడిని నమ్ముతున్నారా” అని అడగండి. వారు అలా ఎందుకు అడుగుతున్నావు? అని అంటారు. కానీ వారిని, ‘మీరు ఎందుకు నమ్ముతారు,’ అని అడిగితే… “మా అమ్మ అలా నేర్పించింది, మన ధర్మం అలా నేర్పిస్తుంది, మన శాస్త్రాలు ఇలా నేర్పిస్తాయి” అని సమాధానం చెబుతారు. అదే మనం ‘మీరేమి చెబుతారు?’ అని అడిగితే వారు నిశ్శబ్దంగా ఉంటారు. “నేనేమీ చెప్పను, ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం, నేను భగవంతుని మీద విశ్వాసం ఉంచుతాను” అని అంటారు. ఇది ధర్మం యొక్క విషయం. ఆధ్యాత్మికతలో ఏముంటుంది? ఆధ్యాత్మికతలో మొదట అనుభూతి కలుగుతుంది “అవును నేను ఈశ్వరీయ తత్వాన్ని అనుభూతి చెందాను… కాబట్టి నేను భగవంతుణ్ణి నమ్ముతాను” అని భావిస్తాము. రెండింటికి మధ్య ఇలా చాలా తేడా ఉంటుంది… కాబట్టి మనకు ధ్యాన పద్ధతిలో భగవంతుని యొక్క అనుభూతి కల్గుతుంది. రెండవ ప్రశ్న మీ ముందు ఉంచుతాను… భగవంతుని కోసం మనం ఎక్కడ వెతకాలి? ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడ వెతకాలి? శాస్త్రాలు ఈశ్వరుడు అన్నిచోట్ల ఉంటాడు, అని చెబుతాయి. మీకు ఉదాహరణగా నేను ఒక పరిస్థితిని వివరిస్తాను… తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు… బిడ్డ తల్లి నుండి వేరుపడగానే ఏడుస్తాడు. బిడ్డ ఏడవడం తల్లికి చాలా ఆనందం కలిగిస్తుంది. తర్వాత ఎప్పుడైనా బిడ్డ ఏడిస్తే తల్లి కూడా ఏడుస్తుంది… కానీ ఈ జన్మనిచ్చే సమయంలో మాత్రమే బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి మొహంలో నవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే బిడ్డతో ఏదైతే రావలసి ఉందో అది వచ్చింది. దాన్ని మనం ఆత్మ, జీవశక్తి, జీవన దాత లేదా ఇంగ్లీషులో సోల్ అంటాం. శాస్త్రాలు చదివిన వారు ఆత్మ లేదా జీవాత్మ అంటారు. ఏ పేరైనా పెట్టండి, తేడా ఏమీ ఉండదు. మనకు జీవాన్నిచ్చేది మన లోపల ఉందా? లోపలే ఉంది కదా! బయట లేదు కదా! అది లేకుండా మనం ప్రార్థించలేము. ధ్యానం కూడా చేయలేము. అది లేకుండా మనం ద్వారక కూడా వెళ్లలేం. ఏదైతే మన లోపల ఉందో, దేని అనుభూతి లోపలే పొందాలో… దాని దర్శనం కోసం మనం బయటకు పరిగెడితే దర్శనం ఎలా జరుగుతుంది? మీరు కొంచెం ఆలోచించండి. ఇప్పుడు అనుభూతి చెందవలసినది బయట ఎప్పటికీ లభించదు. బయట అనుభూతి ఎలా అవుతుంది? ఉదాహరణకు నేను సెంటు రాసుకున్నా, అత్తరు పూసుకున్నా ముక్కు ద్వారా దాని సుగంధం వస్తుంది. ఏదైనా తిన్నప్పుడు అది కడుపులో పడుతుంది. శాంతి అనుభవం పొందాలంటే, అది హృదయం ద్వారానే అనుభూతి చెందబడుతుంది. శ్రీకృష్ణ భగవానునితో అర్జునుడు, “శ్రీకృష్ణా! మీరు నా స్నేహితులు. నాకు మీ విశ్వరూపాన్ని చూపించారు… దయచేసి మీ నిజరూపంలోకి రండి. ఈ రూపం నన్ను గాభరా పెడుతున్నది, భయపెడుతున్నది.. రాబోయే తరాల వారు మీ దర్శనం ఎలా చేసుకుంటారు?” అని అడిగాడు. ‘హృదయమే పశ్యసి’ అని శ్రీకృష్ణుడు అంటారు. “మీ హృదయంలో మీరు నన్ను అనుభూతి చెందండి”. “ద్వారకకు వెళ్లి లేదా కైలాసంలో అనుభూతి చెందండి అని చెప్పలేదు… ‘హృదయమే పశ్యసి’ అంటే ప్రతి హృదయంలో నేనున్నాను”, అన్నారు. అయినప్పటికీ మనం తప్పు చేస్తూనే ఉంటే, దానికి పరిష్కారం ఎలా లభిస్తుంది? తప్పు చేస్తూ ఉంటే మంచి పరిష్కారం లభించదు. అలాగని నేను ఈశ్వరుని అంగీకరించనని అర్థం కాదు. నేను మీకు, మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి, ఒక విధంగా సరైన మార్గాన్ని చూపించడానికే ప్రయత్నిస్తున్నాను. అందుకే మన వేదాలలో, ఉపనిషత్తులలో ఆయనను ‘అంతర్యామిన్’ అని చెప్పబడింది. అంటే లోపల ఉండేది, బయట లేదని అర్థం. ఆయన అనుభూతి లోపలే కలుగుతుంది. ఈరోజు మనం అనుభూతి చెందడానికి ప్రయత్నిద్దాం. మీలో ఎంతమంది హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో ఈ ఉదయం ధ్యానం చేశారు? ఓహ్! చాలామంది ఉన్నారు. ఇంకా ఎక్కువగా చెప్పే అవసరం లేదనిపిస్తుంది. మరి నేను ఎందుకు చెప్తున్నాను? నేరుగా మనం ధ్యానం చేద్దాం. సోదరి జర్శ్వీందర్ ఇక్కడ ఉన్నట్లయితే, దయచేసి మాతో రిలాక్సేషన్ చేయించమని మనవి చేస్తున్నాను. వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు ఒక కార్యక్రమం ఉంది… ఆశా ఫౌండేషన్, ఓరియంట్ పేపర్ మిల్స్ మరియు హార్ట్ఫుల్నెస్ ఏకమైతే ఫలితం ఏమై ఉంటుంది? ఆధ్యాత్మికంలో ఉన్నతి అయితే కలగాలి కదా! భౌతిక జీవితంలో కూడా ఉన్నతి కలుగుతుంది. భౌతిక జీవితంలో, విద్యలో, సామాజిక జీవితంలో, మన ఉద్వేగపరమైన జీవితంలో అన్నింటిలో అభివృద్ధి జరుగుతుంది. ఒక ఉదాహరణను చూద్దాం. కాగితం కోసం యూకలిప్టస్ పెంచుతాం… అలాగే ప్రతి గ్రామంలో బంజరు భూమి ఉన్న చోట ఒక ఎకరం, 10 ఎకరాల స్థలంలో… గ్రామస్తులు అందరితో కలిసి తెల్లచందనం, ఎర్రచందనం మొక్కలను నాటుదాం. మీరు ఏమీ చేయనవసరం లేదు. మేమే నాటుతాం. ప్రతి ఉదయం అక్కడికి వెళ్లి ఒక మగ్గు నీళ్లను పోయడం మీ పని. ఇంతకంటే ఏమీ చేసేది లేదు. పది సంవత్సరాల దాకా మీ గ్రామస్తులు అందరూ కలిసి వాటి సంరక్షణ చేయాలి. చాలామంది వాటిని దొంగతనంగా ఎత్తుకొని పోతారు. ఒక మొక్క ఖరీదు నల్ల బజారులో ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఐదు లక్షల రూపాయలు! మనం కావాలనుకుంటే వెయ్యి, పది వేలు మొక్కలను నాటితే ఎంత అవుతుందో లెక్క వేయండి. 500 కోట్లు అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఆ 500 కోట్ల రూపాయలను గ్రామస్తులందరికీ పంచండి. మీ నుండి మేం ఏమీ తీసుకోము. ఆశా వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారు కదా! వారు కూడా మీ నుండి ఏమి తీసుకోవాలనుకోరు. ఆలోచించండి. వీళ్లు ఇంత దూరం నుండి వస్తారు. వారికి ఏ స్వార్థమూ లేదు. మాకు ఏమీ అవసరం లేదని వారు మనకు గ్యారెంటీ వ్రాసిస్తారు. మీరు ఉదయం, సాయంత్రం కళ్ళు మూసుకుని ఈశ్వరుని ధ్యానించండి. అంతే!