02-07-2023 Daaji Talk- Kanha
గురు పౌర్ణమి దాజి ప్రసంగం
గౌరవనీయులు, నేను ‘బడేభయ్యా’ గా పిలిచే డా. దీపక్ చోప్రా, మీ అంతర్దృష్టితో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు! అలాగే మీరు సరిగ్గా, దృఢంగా మీ సందేశంలో చైతన్యంపై ప్రసంగించారు. మన అందరికీ ఏదో ఒక మానసిక స్థాయిలో చైతన్యం ఉందనేది అర్థమవుతుంది… అది రెండు మహాసముద్రాల మధ్య ఉండే ఒక పలుచని నీటిపొర వలే ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల మధ్య ఉన్నట్లు చాలా ఇబ్బందికరంగా ఈ చైతన్యమనే సన్నని నీటి పొర ఉంటుంది. మనం అధిచైతన్యంలోకి (సూపర్ కాన్షియస్) ఎగరవలసి ఉంది… అలాగే ఉపచైతన్యం లోకి (సబ్ కాన్షియస్) మునక వేయవలసి ఉంది. అలా మనకు లభ్యమయ్యే చైతన్యాన్ని విస్తరింప చేసుకోవాలి. నిత్య జీవితంలో మనం ‘బ్రాడ్ బ్యాండ్’ అని పిలిచే విశ్వచైతన్యంతో మార్పిడి చేయగలగాలి. మనకున్న ఈ వ్యక్తిగత చైతన్యంతో, మనసు, బుద్ధి, అహం లను ఎలా సూక్ష్మీకరించగలం? ఎలా పరిణతి చెందగలం? అనేదే మన హార్ట్ఫుల్నెస్ విధానం. మనసును ఎలా సూక్ష్మీకరించుకోవాలో
చాలాసార్లు వివరించడం జరిగింది. అలాగే బుద్ధి, అహం కూడా ఎలా చక్కగా శృతి చేసుకోవాలో, క్రమానుగత పరిణామ ఫలితంగా అవి ఎలా రూపాంతరం చెందుతాయో వివరించడం జరిగింది. వికాస ఫలితంగా మనసు, బుద్ధి, అహం ల పనితీరు పరిణామం చెందుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఈ చైతన్య వికాసంలోని నిరంతర మార్పులను అనుభూతి చెందుతాం. ఈ మూడు ప్రాథమిక కారకాల వల్ల చైతన్యం ప్రభావితం చెందుతుంది. మీరు తప్పుగా ఆలోచిస్తే, తప్పుగా వివేకాన్ని ఉపయోగిస్తే… అలాగే ‘నా ఇష్టం’ అని అంటే, అప్పుడు మీ చైతన్యానికి ఏమవుతుంది? అది కుచించుకుపోతుంది. ప్రేమైక హృదయాలు దేన్నైనా వదిలేయడానికి సిద్ధమవుతాయి. ఎప్పుడూ లేదు, కాదు అని చెప్పని హృదయాలు… ధ్యానం ద్వారా నిరంతరం విస్తరిస్తాయి. మనసు ఆలోచన స్థాయి నుండి మరింత లోతైన స్థాయి అయిన అనుభూతికి పరిణామం చెందుతుంది. బుద్ధి క్రమంగా తెలివితేటలు, అంతర్దృష్టి ద్వారా, వివేకంగా పరిణామం చెందుతుంది. ఇది హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ద్వారా జరుగుతుంది. ప్రతిరోజు క్లీనింగ్ చేసుకుంటూ పొరలు పొరలుగా మన గతం తాలూకు సంస్కారాలని, ముద్రలని తొలగించుకున్నప్పుడు… మనం ఉపచేతనలోకి లోతుగా మునక వేయగలుగుతాం. అదే సమయంలో అహాన్ని ఉపయోగించుకుంటూ మనల్ని మరింత ఉన్నతీకరించుకుంటాం. అహం కూడా మనల్ని నిరోధిస్తుంది. దానికి ఎన్నో ముఖాలు, పార్శ్వాలు ఉన్నాయి. మన స్వీయ చైతన్యాన్ని, విశ్వ చైతన్యంతో ముడి వేసినప్పుడు, అహాన్ని మన స్వీయ అభివృద్ధికి ఉపయోగించవచ్చు. మన ప్రియతమ గురువర్యులు బాబూజీ మహరాజ్ మన అందరిలో ఇలా ఆలోచన రేకెత్తిస్తారు. చిన్నతనంలో పిల్లలు బొమ్మలతో ఆడుతూ ఆనందిస్తారు. అది వారికి ఆటవిడుపు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యుక్త వయస్సు, యువత ప్రణయ కలాపాలలో మునిగి తేలతారు. దాంట్లో తప్పేమీ లేదు. పిల్లలకు బొమ్మలు, పెద్దలకు ప్రణయం, కుటుంబాలను ఏర్పరచుకోవడం. శృంగారం ప్రేమగా రూపాంతరం చెందుతుంది. ఆటల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మహర్షులు, యోగులు, వారి వారి చైతన్యంతో ఆటలాడుతారు. వారికి వారి చైతన్యమే ఆటవస్తువు. వారు చైతన్యంతో ఆడుకుంటారు. బాబూజీ మహరాజ్ ఒక ప్రాథమిక ప్రశ్నపై మనల్ని ఆలోచించమని సవాల్ విసురుతున్నారు. చైతన్యానికి ఆధార భూతమైనది ఏది? ధ్యానంలో లోతుగా మునిగి, చైతన్యానికి మూలం ఏమిటో మనల్ని కనుగొనమంటున్నారు. చైతన్యానికి మూలాధారాన్ని అనుభూతి చెందమని కోరుతున్నారు. శాస్త్రపరంగా చైతన్యం అంటే, మన అవగాహన. సరళంగా నిర్వచించాలంటే మన ఎరుక, మన అవగాహనా స్థాయి. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయనప్పుడు మన అవగాహన తగ్గుముఖం పడుతుంది. అయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఒక చిన్న పిల్లవాడు అంతర్దృష్టితో విషయాలను ఎలా తెలుసుకోగలుగుతున్నాడు? దేన్నీ ముట్టుకోకుండా, వినకుండా లేదా ఏమీ చేయకుండా కేవలం కళ్ళు మూసుకొని చుట్టుపక్కల జరిగేవి ఎలా గ్రహించగలుగుతున్నాడు? ఇంద్రియాలకు అతీతంగా ఎలా చక్కగా గ్రహించగలుగుతున్నాడు? అదే మన బ్రైటర్ మైండ్స్ సాధన! అదృష్టవశాత్తూ మనం ఆ సామర్ధ్యాలను 15 సంవత్సరాల వయసు వరకే ఉపయోగించగలుగుతున్నాం.15 ఏళ్ల పైన మనం ఆ శక్తిని కోల్పోతాం. పనిచేయని నాడులు క్రమంగా తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి కదా! ‘ఉపయోగించనివి పోగొట్టుకుంటాం’ అనే నానుడి ఉంది కదా! కనుక మన పిల్లలకు 15 సంవత్సరాలు దాటకముందే శిక్షణను ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. దానివల్ల అంతర్దృష్టి పెంపొందుతుంది. మన సోదరి ఏకాత్మ అభియాన్ గురించి మాట్లాడింది. కొన్ని నెలల క్రితం ఇది ప్రారంభించబడింది. మన వాలంటీర్లు, ప్రిసెప్టర్లు… ప్రియమైన సోదరి సులోచన గారు దయచేసి నిలబడండి… ఆమెకు 80 సంవత్సరాలు. ఆమె హైదరాబాద్ నుండి స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ, మధ్యప్రదేశ్ లోని ఎన్నో గ్రామాలకు ప్రయాణించారు. ఆమె ఏ గ్రామానికి వెళ్లినా, ’80 సంవత్సరాల అమ్మమ్మ, వాళ్లకు ధ్యానాన్ని బోధించడానికి వచ్చిందని’ అక్కడి ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్కడివాళ్ళు బాబూజీ కోసమో, హార్ట్ఫుల్నెస్ కోసమో కాకుండా… ఒక 80 సంవత్సరాల స్త్రీ హైదరాబాద్ నుండి కారును స్వయంగా నడుపుతూ మధ్యప్రదేశ్ కు వచ్చిందని… ఆ తరువాతి గ్రామ ప్రజలు కూడా ఆమె కోసం వేచి ఉండేవారు. ధన్యవాదాలు… నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది. సులోచన ఆంటీయే కాకుండా ఎంతోమంది యువత కూడా ఇందులో పాల్గొన్నారు. ఎటువంటి వసతులు లేని చోట – భారతీయ గ్రామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా! వాళ్లు అక్కడ సర్దుకుపోయారు. వాళ్లంతా ఎంతో అద్భుతంగా పనిచేసి 12 మిలియన్ల మందికి, అంటే 1.2 కోట్ల మందికి మన పద్ధతిని పరిచయం చేశారు. కేవలం ఒక్కసారి కాదు, వాళ్లు ఆ గ్రామంలో గడిపిన మూడు రోజుల్లో అక్కడి ప్రజలచే కనీసం 3 నుండి 4 సార్లు ధ్యానం చేయించారు. ఇక ఇప్పుడు వాళ్లకు వాట్స్అప్ సమూహాలు ఏర్పడ్డాయి. సాంకేతికత పుణ్యమా అని ఇప్పుడు దూరం నుండి కూడా సత్సంగ్ నిర్వహించే అవకాశం ఏర్పడింది. ఇది ఇంతటితో అయిపోలేదు. 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, మన హార్ట్ఫుల్నెస్ సంస్థ ఎంతోమందిచే ప్రశంసించబడింది. మరీ ముఖ్యంగా మన ఉపరాష్ట్రపతి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి మనపై ఎన్నో, ఎన్నెన్నో ప్రశంసలను, గుర్తింపును కుమ్మరించారు. అంతర్జాతీయ సమాజం కూడా హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ ఒకటి ఉందని, ఇక్కడ శిక్షణ ఉచితమని అర్థం చేసుకుందని విశ్వసిస్తున్నాను. చోప్రా ఫౌండేషన్ లాగే మన సంస్థ కూడా ఒక లాభాపేక్ష లేని సంస్థ కనుక మనం ధ్యానం నేర్పడానికి ఎటువంటి రుసుము వసూలు చేయము. మన ప్రాచీన సంప్రదాయం ఎంతో సరళం. బ్రహ్మవిద్యకు ఎవరమూ వెలకట్టలేం. వెలకట్టి చెల్లించగలిగితే ఇక మీకు భగవంతుని అవసరం ఏముంది? భగవాన్ శ్రీకృష్ణుని జయంతి రోజున, అంటే సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమిగా జరుపుకునే వేళ… మేము ఇదే ఏకాత్మ అభియాన్ కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్రంలో, అలాగే ఉత్తరప్రదేశ్ లోని బులంద్ ఖండ్ ప్రాంతంలో ప్రారంభిస్తున్నాం. మన ఈ తదుపరి కార్యక్రమం మరింత ఉత్సాహంగా మొదలుపెట్టడానికి, వింటున్న మీ అందరినీ దయచేసి సిద్ధంగా ఉండమని కోరుతున్నాను. అయితే మధ్యప్రదేశ్ ను మరువకండి. మనం ప్రారంభించిన దాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాలి. అక్కడి గ్రామీణులతో టచ్ లో ఉండి, వారి జీవనశైలిని ధ్యానం ద్వారా మెరుగుపరచడానికి సహాయం చేయండి. వారి ఆర్థిక సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి తోడ్పడండి. నూతన వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ఇష్టపడే వారిని… వారి పొలాలలో మరింత దిగుబడి పెంచడానికి సరిపడే మెలకువలను నేర్చుకోవడానికి, మనం వారిని కాన్హాకు స్వాగతించాలి. ఆధ్యాత్మికమే కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళ స్థాయి మెరుగు పడేందుకు మనం కృషి చేయాలి.
02-07-2023 Daaji Talk- Kanha
గురు పౌర్ణమి దాజి ప్రసంగం
గౌరవనీయులు, నేను ‘బడేభయ్యా’ గా పిలిచే డా. దీపక్ చోప్రా, మీ అంతర్దృష్టితో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు! అలాగే మీరు సరిగ్గా, దృఢంగా మీ సందేశంలో చైతన్యంపై ప్రసంగించారు. మన అందరికీ ఏదో ఒక మానసిక స్థాయిలో చైతన్యం ఉందనేది అర్థమవుతుంది… అది రెండు మహాసముద్రాల మధ్య ఉండే ఒక పలుచని నీటిపొర వలే ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల మధ్య ఉన్నట్లు చాలా ఇబ్బందికరంగా ఈ చైతన్యమనే సన్నని నీటి పొర ఉంటుంది. మనం అధిచైతన్యంలోకి (సూపర్ కాన్షియస్) ఎగరవలసి ఉంది… అలాగే ఉపచైతన్యం లోకి (సబ్ కాన్షియస్) మునక వేయవలసి ఉంది. అలా మనకు లభ్యమయ్యే చైతన్యాన్ని విస్తరింప చేసుకోవాలి. నిత్య జీవితంలో మనం ‘బ్రాడ్ బ్యాండ్’ అని పిలిచే విశ్వచైతన్యంతో మార్పిడి చేయగలగాలి. మనకున్న ఈ వ్యక్తిగత చైతన్యంతో, మనసు, బుద్ధి, అహం లను ఎలా సూక్ష్మీకరించగలం? ఎలా పరిణతి చెందగలం? అనేదే మన హార్ట్ఫుల్నెస్ విధానం. మనసును ఎలా సూక్ష్మీకరించుకోవాలో
చాలాసార్లు వివరించడం జరిగింది. అలాగే బుద్ధి, అహం కూడా ఎలా చక్కగా శృతి చేసుకోవాలో, క్రమానుగత పరిణామ ఫలితంగా అవి ఎలా రూపాంతరం చెందుతాయో వివరించడం జరిగింది. వికాస ఫలితంగా మనసు, బుద్ధి, అహం ల పనితీరు పరిణామం చెందుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఈ చైతన్య వికాసంలోని నిరంతర మార్పులను అనుభూతి చెందుతాం. ఈ మూడు ప్రాథమిక కారకాల వల్ల చైతన్యం ప్రభావితం చెందుతుంది. మీరు తప్పుగా ఆలోచిస్తే, తప్పుగా వివేకాన్ని ఉపయోగిస్తే… అలాగే ‘నా ఇష్టం’ అని అంటే, అప్పుడు మీ చైతన్యానికి ఏమవుతుంది? అది కుచించుకుపోతుంది. ప్రేమైక హృదయాలు దేన్నైనా వదిలేయడానికి సిద్ధమవుతాయి. ఎప్పుడూ లేదు, కాదు అని చెప్పని హృదయాలు… ధ్యానం ద్వారా నిరంతరం విస్తరిస్తాయి. మనసు ఆలోచన స్థాయి నుండి మరింత లోతైన స్థాయి అయిన అనుభూతికి పరిణామం చెందుతుంది. బుద్ధి క్రమంగా తెలివితేటలు, అంతర్దృష్టి ద్వారా, వివేకంగా పరిణామం చెందుతుంది. ఇది హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ద్వారా జరుగుతుంది. ప్రతిరోజు క్లీనింగ్ చేసుకుంటూ పొరలు పొరలుగా మన గతం తాలూకు సంస్కారాలని, ముద్రలని తొలగించుకున్నప్పుడు… మనం ఉపచేతనలోకి లోతుగా మునక వేయగలుగుతాం. అదే సమయంలో అహాన్ని ఉపయోగించుకుంటూ మనల్ని మరింత ఉన్నతీకరించుకుంటాం. అహం కూడా మనల్ని నిరోధిస్తుంది. దానికి ఎన్నో ముఖాలు, పార్శ్వాలు ఉన్నాయి. మన స్వీయ చైతన్యాన్ని, విశ్వ చైతన్యంతో ముడి వేసినప్పుడు, అహాన్ని మన స్వీయ అభివృద్ధికి ఉపయోగించవచ్చు. మన ప్రియతమ గురువర్యులు బాబూజీ మహరాజ్ మన అందరిలో ఇలా ఆలోచన రేకెత్తిస్తారు. చిన్నతనంలో పిల్లలు బొమ్మలతో ఆడుతూ ఆనందిస్తారు. అది వారికి ఆటవిడుపు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యుక్త వయస్సు, యువత ప్రణయ కలాపాలలో మునిగి తేలతారు. దాంట్లో తప్పేమీ లేదు. పిల్లలకు బొమ్మలు, పెద్దలకు ప్రణయం, కుటుంబాలను ఏర్పరచుకోవడం. శృంగారం ప్రేమగా రూపాంతరం చెందుతుంది. ఆటల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మహర్షులు, యోగులు, వారి వారి చైతన్యంతో ఆటలాడుతారు. వారికి వారి చైతన్యమే ఆటవస్తువు. వారు చైతన్యంతో ఆడుకుంటారు. బాబూజీ మహరాజ్ ఒక ప్రాథమిక ప్రశ్నపై మనల్ని ఆలోచించమని సవాల్ విసురుతున్నారు. చైతన్యానికి ఆధార భూతమైనది ఏది? ధ్యానంలో లోతుగా మునిగి, చైతన్యానికి మూలం ఏమిటో మనల్ని కనుగొనమంటున్నారు. చైతన్యానికి మూలాధారాన్ని అనుభూతి చెందమని కోరుతున్నారు. శాస్త్రపరంగా చైతన్యం అంటే, మన అవగాహన. సరళంగా నిర్వచించాలంటే మన ఎరుక, మన అవగాహనా స్థాయి. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయనప్పుడు మన అవగాహన తగ్గుముఖం పడుతుంది. అయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఒక చిన్న పిల్లవాడు అంతర్దృష్టితో విషయాలను ఎలా తెలుసుకోగలుగుతున్నాడు? దేన్నీ ముట్టుకోకుండా, వినకుండా లేదా ఏమీ చేయకుండా కేవలం కళ్ళు మూసుకొని చుట్టుపక్కల జరిగేవి ఎలా గ్రహించగలుగుతున్నాడు? ఇంద్రియాలకు అతీతంగా ఎలా చక్కగా గ్రహించగలుగుతున్నాడు? అదే మన బ్రైటర్ మైండ్స్ సాధన! అదృష్టవశాత్తూ మనం ఆ సామర్ధ్యాలను 15 సంవత్సరాల వయసు వరకే ఉపయోగించగలుగుతున్నాం.15 ఏళ్ల పైన మనం ఆ శక్తిని కోల్పోతాం. పనిచేయని నాడులు క్రమంగా తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి కదా! ‘ఉపయోగించనివి పోగొట్టుకుంటాం’ అనే నానుడి ఉంది కదా! కనుక మన పిల్లలకు 15 సంవత్సరాలు దాటకముందే శిక్షణను ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. దానివల్ల అంతర్దృష్టి పెంపొందుతుంది. మన సోదరి ఏకాత్మ అభియాన్ గురించి మాట్లాడింది. కొన్ని నెలల క్రితం ఇది ప్రారంభించబడింది. మన వాలంటీర్లు, ప్రిసెప్టర్లు… ప్రియమైన సోదరి సులోచన గారు దయచేసి నిలబడండి… ఆమెకు 80 సంవత్సరాలు. ఆమె హైదరాబాద్ నుండి స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ, మధ్యప్రదేశ్ లోని ఎన్నో గ్రామాలకు ప్రయాణించారు. ఆమె ఏ గ్రామానికి వెళ్లినా, ’80 సంవత్సరాల అమ్మమ్మ, వాళ్లకు ధ్యానాన్ని బోధించడానికి వచ్చిందని’ అక్కడి ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్కడివాళ్ళు బాబూజీ కోసమో, హార్ట్ఫుల్నెస్ కోసమో కాకుండా… ఒక 80 సంవత్సరాల స్త్రీ హైదరాబాద్ నుండి కారును స్వయంగా నడుపుతూ మధ్యప్రదేశ్ కు వచ్చిందని… ఆ తరువాతి గ్రామ ప్రజలు కూడా ఆమె కోసం వేచి ఉండేవారు. ధన్యవాదాలు… నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది. సులోచన ఆంటీయే కాకుండా ఎంతోమంది యువత కూడా ఇందులో పాల్గొన్నారు. ఎటువంటి వసతులు లేని చోట – భారతీయ గ్రామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా! వాళ్లు అక్కడ సర్దుకుపోయారు. వాళ్లంతా ఎంతో అద్భుతంగా పనిచేసి 12 మిలియన్ల మందికి, అంటే 1.2 కోట్ల మందికి మన పద్ధతిని పరిచయం చేశారు. కేవలం ఒక్కసారి కాదు, వాళ్లు ఆ గ్రామంలో గడిపిన మూడు రోజుల్లో అక్కడి ప్రజలచే కనీసం 3 నుండి 4 సార్లు ధ్యానం చేయించారు. ఇక ఇప్పుడు వాళ్లకు వాట్స్అప్ సమూహాలు ఏర్పడ్డాయి. సాంకేతికత పుణ్యమా అని ఇప్పుడు దూరం నుండి కూడా సత్సంగ్ నిర్వహించే అవకాశం ఏర్పడింది. ఇది ఇంతటితో అయిపోలేదు. 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, మన హార్ట్ఫుల్నెస్ సంస్థ ఎంతోమందిచే ప్రశంసించబడింది. మరీ ముఖ్యంగా మన ఉపరాష్ట్రపతి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి మనపై ఎన్నో, ఎన్నెన్నో ప్రశంసలను, గుర్తింపును కుమ్మరించారు. అంతర్జాతీయ సమాజం కూడా హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ ఒకటి ఉందని, ఇక్కడ శిక్షణ ఉచితమని అర్థం చేసుకుందని విశ్వసిస్తున్నాను. చోప్రా ఫౌండేషన్ లాగే మన సంస్థ కూడా ఒక లాభాపేక్ష లేని సంస్థ కనుక మనం ధ్యానం నేర్పడానికి ఎటువంటి రుసుము వసూలు చేయము. మన ప్రాచీన సంప్రదాయం ఎంతో సరళం. బ్రహ్మవిద్యకు ఎవరమూ వెలకట్టలేం. వెలకట్టి చెల్లించగలిగితే ఇక మీకు భగవంతుని అవసరం ఏముంది? భగవాన్ శ్రీకృష్ణుని జయంతి రోజున, అంటే సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమిగా జరుపుకునే వేళ… మేము ఇదే ఏకాత్మ అభియాన్ కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్రంలో, అలాగే ఉత్తరప్రదేశ్ లోని బులంద్ ఖండ్ ప్రాంతంలో ప్రారంభిస్తున్నాం. మన ఈ తదుపరి కార్యక్రమం మరింత ఉత్సాహంగా మొదలుపెట్టడానికి, వింటున్న మీ అందరినీ దయచేసి సిద్ధంగా ఉండమని కోరుతున్నాను. అయితే మధ్యప్రదేశ్ ను మరువకండి. మనం ప్రారంభించిన దాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాలి. అక్కడి గ్రామీణులతో టచ్ లో ఉండి, వారి జీవనశైలిని ధ్యానం ద్వారా మెరుగుపరచడానికి సహాయం చేయండి. వారి ఆర్థిక సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి తోడ్పడండి. నూతన వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ఇష్టపడే వారిని… వారి పొలాలలో మరింత దిగుబడి పెంచడానికి సరిపడే మెలకువలను నేర్చుకోవడానికి, మనం వారిని కాన్హాకు స్వాగతించాలి. ఆధ్యాత్మికమే కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళ స్థాయి మెరుగు పడేందుకు మనం కృషి చేయాలి.