మనసు లేదా ఆత్మతో ధ్యానం
మనం ఆత్మతో ధ్యానం చేయం. ఆత్మ ఆలోచించలేదు. శరీరం కూడా ఆలోచించలేదు. కానీ శరీరం యొక్క సహకారంతోనే నేను ధ్యానం చేయగలను. ఎలా కూర్చోవాలి? స్థిరం సుఖం ఆసనం. దేనితో సుఖంగా ఉంటుందో, అంటే దేని వలన శరీరం అసౌకర్యానికి గురికాదో, ఆ భంగిమలో కూర్చోవాలి. అంటే మెడను వెనక్కు వంచి, ఇలా కూర్చోవడం కాదు. దాని వలన మీకు నిద్ర వస్తుంది. సుఖాసనంలో కూర్చోవడం మంచిది. కుర్చీలో కూర్చుంటే, పాదాలను ఇలా ఒకదానిపై ఒకటి వచ్చేలా అమర్చి కూర్చోండి. చేతులను ఇలా జోడించాలి. ఇంత మాత్రమే శరీరం యొక్క సహకారం కావాలి. వీలైతే మెడను నిటారుగా పెట్టి కూర్చోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మన తల కొంచెం వంగితే పరవాలేదు. కానీ మరీ పూర్తిగా వంగిపోవడం మంచిది కాదు. అంటే శరీరం యొక్క సహకారం కూడా మనకు కావాలి. కానీ ధ్యానం మన మనసుతో జరుగుతుంది. కొంతమంది సాధువులు మనసును శత్రువుగా భావిస్తారు. కానీ ఎప్పుడైతే మనం మనసుకు శిక్షణ ఇస్తామో, అప్పుడు దాన్ని మించిన స్నేహితుడు ఎవరూ లేరని సహజమార్గంలో మేము నమ్ముతాం. ధ్యానమంటే మనసుకు శిక్షణనివ్వడమే! ధ్యానమనేది ఎలాంటిదంటే, దానిలో మనం మన మనస్సుతో కసరత్తు చేస్తాం శారీరక శక్తి కోసం మనం యోగాసనాలు వేస్తాం. ప్రాణాయామం చేస్తాం. అలాగే మానసిక శక్తిని పెంచుకునేందుకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఇంకా దీనిలో ప్రాణాహుతి యొక్క సమ్మేళనం ఉంటే మన చేతనత్వం విస్తరిస్తూ ఉంటుంది, సంస్కరించబడుతూ ఉంటుంది. మేఘాలు సూర్యునికి అడ్డుగా వచ్చినప్పుడు ప్రకాశం తగ్గుతుంది కదా! అలాగే మన చైతన్యం జడంగా నల్లని మేఘం వలె ఉన్నప్పుడు ఆత్మ యొక్క ప్రకాశం వెలుపలికి రాదు. ఆత్మ ప్రకాశం దాని వరకు చేరకపోవడం వల్ల బుద్ధి మందగిస్తుంది. ఆత్మ మన మనస్సును, చేతనను, అహాన్ని ఉపయోగించుకుంటుంది. ఆత్మ మన బుద్ధిని ఉపయోగించుకుంటుంది. చిత్, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ నాలుగు ధ్యానం వల్ల పవిత్రం అవుతాయి. వీటిలోని అంధకారం తగ్గుతూ ఆత్మ యొక్క ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. ఈ నాలుగింటిని మనం సూక్ష్మ శరీరాలు అంటాం. చిత్, మనస్సు, బుద్ధి, అహంకారం అనబడే ఈ నాలుగింటితో సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఒక సమయం ఎలా వస్తుందంటే, ఇవి కేవలం పారదర్శకమైన పరదాలవుతాయి. ఎంత పవిత్రం అవుతాయంటే, నామమాత్రంగానే పరదాలుగా ఉంటాయి. పరదా చిరిగిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది.
ధ్యానం తరువాత మనసు లేదా ఆత్మతో ధ్యానం
మనం ఆత్మతో ధ్యానం చేయం. ఆత్మ ఆలోచించలేదు. శరీరం కూడా ఆలోచించలేదు. కానీ శరీరం యొక్క సహకారంతోనే నేను ధ్యానం చేయగలను. ఎలా కూర్చోవాలి? స్థిరం సుఖం ఆసనం. దేనితో సుఖంగా ఉంటుందో, అంటే దేని వలన శరీరం అసౌకర్యానికి గురికాదో, ఆ భంగిమలో కూర్చోవాలి. అంటే మెడను వెనక్కు వంచి, ఇలా కూర్చోవడం కాదు. దాని వలన మీకు నిద్ర వస్తుంది. సుఖాసనంలో కూర్చోవడం మంచిది. కుర్చీలో కూర్చుంటే, పాదాలను ఇలా ఒకదానిపై ఒకటి వచ్చేలా అమర్చి కూర్చోండి. చేతులను ఇలా జోడించాలి. ఇంత మాత్రమే శరీరం యొక్క సహకారం కావాలి. వీలైతే మెడను నిటారుగా పెట్టి కూర్చోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మన తల కొంచెం వంగితే పరవాలేదు. కానీ మరీ పూర్తిగా వంగిపోవడం మంచిది కాదు. అంటే శరీరం యొక్క సహకారం కూడా మనకు కావాలి. కానీ ధ్యానం మన మనసుతో జరుగుతుంది. కొంతమంది సాధువులు మనసును శత్రువుగా భావిస్తారు. కానీ ఎప్పుడైతే మనం మనసుకు శిక్షణ ఇస్తామో, అప్పుడు దాన్ని మించిన స్నేహితుడు ఎవరూ లేరని సహజమార్గంలో మేము నమ్ముతాం. ధ్యానమంటే మనసుకు శిక్షణనివ్వడమే! ధ్యానమనేది ఎలాంటిదంటే, దానిలో మనం మన మనస్సుతో కసరత్తు చేస్తాం శారీరక శక్తి కోసం మనం యోగాసనాలు వేస్తాం. ప్రాణాయామం చేస్తాం. అలాగే మానసిక శక్తిని పెంచుకునేందుకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఇంకా దీనిలో ప్రాణాహుతి యొక్క సమ్మేళనం ఉంటే మన చేతనత్వం విస్తరిస్తూ ఉంటుంది, సంస్కరించబడుతూ ఉంటుంది. మేఘాలు సూర్యునికి అడ్డుగా వచ్చినప్పుడు ప్రకాశం తగ్గుతుంది కదా! అలాగే మన చైతన్యం జడంగా నల్లని మేఘం వలె ఉన్నప్పుడు ఆత్మ యొక్క ప్రకాశం వెలుపలికి రాదు. ఆత్మ ప్రకాశం దాని వరకు చేరకపోవడం వల్ల బుద్ధి మందగిస్తుంది. ఆత్మ మన మనస్సును, చేతనను, అహాన్ని ఉపయోగించుకుంటుంది. ఆత్మ మన బుద్ధిని ఉపయోగించుకుంటుంది. చిత్, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ నాలుగు ధ్యానం వల్ల పవిత్రం అవుతాయి. వీటిలోని అంధకారం తగ్గుతూ ఆత్మ యొక్క ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. ఈ నాలుగింటిని మనం సూక్ష్మ శరీరాలు అంటాం. చిత్, మనస్సు, బుద్ధి, అహంకారం అనబడే ఈ నాలుగింటితో సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఒక సమయం ఎలా వస్తుందంటే, ఇవి కేవలం పారదర్శకమైన పరదాలవుతాయి. ఎంత పవిత్రం అవుతాయంటే, నామమాత్రంగానే పరదాలుగా ఉంటాయి. పరదా చిరిగిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది.