(శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజ్య దాజీ 29 ఆగష్టు 2021న ఆదివారం ఉదయం 7 గంటల ధ్యానం తరువాత ఇచ్చిన ప్రసంగం)
నమస్తే జీ!హ్యాపీ జన్మాష్టమి!గీతా బోధలు సనాతనమైనవి. కాలపరీక్షకు నిలిచినవి. అవి మనలో ఏదో ఒక రకంగా ప్రేరణలు కలుగజేస్తాయి. దురదృష్టవశాత్తు ఆ ప్రేరణలు ఎంత ఉత్కృష్టమైనవైనప్పటికీ, సాధకులు వేటినైతే సాక్షాత్కరించుకోవాలని తపిస్తున్నారో, ఆ దిశగా తరువాతి అడుగు వేయలేకపోతున్నారు. మన ఆచార్యులు, ఎంతో కీర్తిని పొందిన మన బోధకులెందరో, మనం చేరుకోవలసిన ఉత్కృష్టమైన స్థితి స్థితప్రజ్ఞత్వం అని నిస్సందేహంగా చెప్పారు. నిజమే! అలాగే మనిషి తాను చేస్తున్న కర్మకు, నిజానికి ఆతను కర్త కాడని కూడా చెప్పడం…